మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 30: జాతీయ స్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్కు మెదక్ జిల్లా నుంచి 6 ప్రాజెక్టులు ఎంపికైనట్లు డీఈవో రమేశ్కుమార్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన 30వ జిల్లా స్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ప్రదర్శనలో జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 95 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులోఆరు ప్రాజెక్టులు రాష్ట్రస్థాయి ప్రదర్శనలకు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు.
ఈనెల 10న రంగారెడ్డి జిల్లాలోని నాట్కో హైస్కూల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రస్థాయిలో ప్రదర్శనలో రాణించి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా కోఆర్డినేటర్ రాజిరెడ్డి, ఎంఈవో నీలకంఠం, జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ అకడమిక్ కో ఆర్డినేటర్ ప్రభు, ప్రధానోపాధ్యాయురాలు రేఖ, న్యాయ నిర్ణేతలు విశ్వనాథ్, దినకర్, గైడ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.