హుస్నాబాద్, ఫిబ్రవరి 24: సిద్దిపేట జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలు బయటపడ్డాయి. అక్రమంగా నిల్వ ఉంచిన నకిలీ పత్తి విత్తనాలను సిద్దిపేట టాస్క్ఫోర్స్, హుస్నాబాద్ పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్లో ముక్కెర మల్లయ్య అనే వ్యక్తి ఇంట్లో సుమారు రూ.35 లక్షల విలువైన నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. 50 కిలోలు ఉండే 26బస్తాలను పోలీసులు గుర్తించారు. హుస్నాబాద్ ఎస్సై తోట మహేశ్ వివరాల ప్రకారం విశ్వసనీయ సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్ఫోర్స్ పోలీసు లు, తాము కలిసి మహ్మదాపూర్లోని ముక్కె ర మల్లయ్య అనే వ్యక్తి ఇంట్లో సోదాలు చేయ గా ఎలాంటి ప్యాకింగ్ లేకుండా, ప్రభుత్వం అనుమతులు లేకుండా ఉన్న పత్తి విత్తనాల బస్తాలు దొరికాయి. వానకాలం ప్రారంభం లో హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మం డలాలతో పాటు ఇతర జిల్లాల మండలాల్లోని రైతులకు విక్రయించేందుకు రహస్యంగా నిల్వ ఉంచారు.
స్వాధీనం చేసుకున్న విత్తన బస్తాలను వ్యవసాయ అధికారులకు అప్పగించారు. వ్యవసాయ అధికారుల ఫిర్యాదుతో పాటు ఇంటి యజమాని ఇచ్చిన వివరాల ప్రకారం నకిలీ పత్తి విత్తనాలను నిల్వ ఉంచిన హన్మకొండ జిల్లా వేలేరు మండల కేంద్రానికి చెందిన పిండి సురేశ్, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లికి చెందిన సతీశ్ అనే వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఇక్కడైనా ఇలాంటి విత్తనాలు నిల్వ ఉన్నట్లు గానీ, విక్రయాలు జరుగుతున్నట్లు గానీ తెలిస్తే వెంటనే 8712667447, 8712667446 నంబర్లకు ఫోన్ చేయాలని ఎస్సై కోరారు. విత్తనాల దుకాణ యజమానులు ప్రభుత్వం సూచించిన, వ్యవసాయ అధికారులు సర్టిఫై చేసిన విత్తనాలను మాత్రమే విక్రయించాలని, నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.