నర్సాపూర్/ నిజాంపేట/ వెల్దుర్తి, ఏప్రిల్ 2 : జిల్లావ్యాప్తం గా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతిని ఆదివారం ప్రజా సంఘాల నాయకులు నిర్వహించారు. నర్సాపూర్ పట్టణంలో గౌడ సంఘ నాయకులు సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా గౌడ సంఘం జిల్ల అధ్యక్షుడు అశోక్గౌడ్ మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ తెలంగాణ యోధుడు, బహుజన వీరుడు అని అభివర్ణించారు. పాపన్నగౌడ్ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పాపన్న జయంతి, వర్ధంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘ నాయకులు ఆంజనేయులుగౌడ్, నాగరాజుగౌడ్, రమేశ్గౌడ్ పాల్గొన్నారు.
సామాజిక సమానత్వం సాధించిన వీరుడు
నిజాంపేట మండలంలోని నస్కల్లో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతిని గౌడ సంఘం నాయకులు నిర్వహించారు. సర్వాయి పాపన్నగౌడ్ వీరత్వంలో శివాజీతో సమానమని, సామాజిక సమానత్వం సాధించిన వీరుడని అన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘ సభ్యులు ఎర్రగౌడ్, వెంకటస్వామిగౌడ్, లక్ష్మగౌడ్, లింగంగౌడ్, స్వామిగౌడ్, రామాగౌడ్, శ్రీనివాస్గౌడ్, శంకర్గౌడ్ తదితరులు ఉన్నారు.
బహుజన నాయకుడు సర్దార్ పాపన్నగౌడ్
వెల్దుర్తి మండలవ్యాప్తంగా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి నిర్వహించారు. వెల్దుర్తిలో గౌడ సంఘం నాయకులు ముత్తాగౌడ్, మహేశ్గౌడ్, వెంకటేశ్గౌడ్, రమేశ్, రవిగౌడ్తో పాటు పలువురు సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ బహుజన నాయకుడు, మహావీరుడు అని కొనియాడారు.