కొల్చారం, ఆగష్టు 1 : మొక్కలు నాటడంతో పాటువ వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. కొల్చారం మండల పరిధిలోని కిష్టాపూర్ సమీపంలో హైవే రోడ్డు పక్కన సోమవారం జడ్పీటీసీ మేఘమాలతో కలిసి ఎమ్మెల్యే మదన్రెడ్డి మొక్కను నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కలలు కన్న హరిత తెలంగాణ ఎంతో దూరంలో లేదన్నారు. మొక్కలు నాటడం ద్వారా భవిష్యత్లో అవి పెరిగి మానవాళి మనుగడకు అవసరమైన గాలి, నీడ, వర్షాలు కురిసేందుకు పరోక్షంగా సహకరిస్తాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గోదావరి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మన్సూర్ అహ్మద్, శేఖర్రెడ్డి, ఏపీవో మహిపాల్రెడ్డి, వెంకటరాములు తదితరులు పాల్గొన్నారు.