పటాన్చెరు టౌన్, డిసెంబర్ 31 : యువత తమ శక్తిని సద్వినియోగం చేసుకుంటే వారికి తిరుగుండదు. వారు సమాజాకి సేవలో ముందుండాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని గోనెమ్మ బస్తీలో నూతనంగా నిర్మించనున్న యువజన కార్యాలయానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువతలో అపారమైన శక్తి ఉంటుందన్నారు. వారి శక్తిని వారి పురోగతికోసం, సేవా కార్యక్రమంకోసం, దేశం కోసం ఉపయోగించాలని సూచించారు. యువత తల్చుకుంటే కాని పనంటు లేదన్నారు.
యువజన సంఘాలకు తాము పెద్దపీట వేస్తున్నామన్నారు. యూత్ రూమ్ నిర్మాణం పూర్తి చేసేందుకు సహకరిస్తామన్నారు. కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, విజయ్కుమార్, ఉప్పరి రాములు, గుండమల్ల రాజు, బస్తీ నాయకులు పాల్గొన్నారు.