పటాన్చెరు, మే 18 : నియోజకవర్గంలోని మారుమూల పంచాయతీలను సైతం అభివృద్ధి చేశామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు మండలం పోచారం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీని మహీధర ప్రాజెక్టు సౌజన్యంతో రూ. 60లక్షలతో ఆధునికంగా నిర్మించారు. పంచాయతీ పరిధిలోని గణపతిగూడెంలో రూ. 18లక్షలతో అంగన్ వాడీ భవని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రతి మారుమూల గ్రామం అభివృద్ధి చెందాలని తరచూ చెబుతుంటారు. ఆ మేరకు నియోజకవర్గంలోని మారుమూల పంచాయతీలను అభివృద్ధిలో ముందుండేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. పార్టీలకతీతంగా సర్పంచ్లను ప్రోత్సహించి గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
పోచారం గ్రామానికి ఒకప్పుడు రాకపోకలు సరిగా ఉండేది కాదని గుర్తు చేశారు. ఇప్పుడు రూ. 28లక్షల ఖర్చుతో సొంత నిధులతో బీటీ రోడ్డును వేయించామన్నారు. ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు సొంత నిధులు ఖర్చు చేసైనా అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు.
బచ్చుగూడెం నుంచి లింక్రోడ్డు, రామమందిరం, స్వాగత తోరణం పనులను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, ఆర్సీపురం కార్పొరేటర్ పుష్ప, గ్రామ సర్పంచ్ జగన్, ఎంపీటీసీ మమత, ఎంపీడీవో బన్సీలాల్, దశరథరెడ్డి, వెంకట్రెడ్డి, అంతిరెడ్డి, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.