పటాన్చెరు టౌన్, ఫిబ్రవరి 1 : పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని రామేశ్వరంబండ, అమీన్ఫూర్ మండలం నర్రెగూడెంలో జేఎన్ఎన్యూఆర్ఎం, వాంబే పథకాల ద్వారా నిర్మించిన గృహాల లబ్ధిదారుల ఎంపిక కోసం పటాన్చెరు పట్టణంలోని జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్హాల్లో డ్రా నిర్వహించారు.
ఈ సందర్భంగా రామేశ్వరంబండ గ్రామానికి చెందిన 156 మందికి, పటాన్చెరు పట్టణానికి చెందిన 471 మందికి, ఆటో యూనియన్ నుంచి 79 మందికి, రామచంద్రాపురం నుంచి 20 మందికి, అమీన్ఫూర్ నుంచి 11 మంది లబ్ధిదారులకు డ్రా పద్ధతిలో జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ పథకంలో నిర్మించిన ప్లాట్లను కేటాయించారు.
డ్రాలో జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పూర్తిగా పారదర్శకంగా డ్రాలు నిర్వహించామన్నారు. పేదప్రజల చిరకాల స్వప్నం అయిన సొంతింటి కలను ఈ పథకం ద్వారా నిజం చేశామన్నారు. మౌలిక వసతులను కల్పించి ఆదర్శ కాలనీలుగా మారుస్తామన్నారు.
నియోజకవర్గంలోని నిరుపేదలకు న్యాయం చేసేందుకు తాను కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, పటాన్చెరు ఎంపీపీ సుష్మశ్రీ, జడ్పీటీసీ సుప్రజ, రామేశ్వరంబండ సర్పంచ్ ధరణి, టీఆర్ఎస్ నాయకులు దశరథరెడ్డి, అంతిరెడ్డి, వెంకట్రెడ్డి, తహసీల్దార్ మహిపాల్రెడ్డి, అఫ్జల్, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.