జహీరాబాద్, అక్టోబర్ 26 : వరంగల్లో జరిగే విజయగర్జన సభకు భారీగా జన సమీకరణ చేసేందుకు కృషి చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు తెలిపారు. మంగళవారం జహీరాబాద్ పట్టణంలోని నిర్వహించి మండల పార్టీ అధ్యక్షుల సమావేశంలో పలు సూచనాలు చేశారు.
సీఎం కేసీఆర్ వరంగల్ విజయగర్జన సభకు భారీగా జన సమీకరణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని, మండల పార్టీ అధ్యక్షులు గ్రామాల వారీగా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి గ్రామం నుంచి ఒక బస్సు ఏర్పాటు చేస్తామని, ప్రజలను సభకు తరలించేందుకు సిద్ధం చేయాలన్నారు. మండల పార్టీ కమిటీతో పాటు అనుబంధ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.
పూర్తి స్థాయిలో కమిటీల జాబితా ఉండాలన్నారు. సమావేశంలో జహీరాబాద్ పట్టణ, మండల, పార్టీ అధ్యక్షులు మోహినోద్దీన్, ఎంజీ.రాములు, మొగుడంపల్లి, న్యాల్కల్, ఝరాసంగం, కోహీర్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్రెడ్డి, రవీందర్, రాచయ్యస్వామి, నర్సింలు పాల్గొన్నారు.