ఝరాసంగం, అక్టోబర్31 : చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని కమాల్పల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ సమద్ కథనం ప్రకారం..గ్రామానికి చెందిన బగిలి హన్మన్న(50) అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల నుంచి ఆనారోగ్యంతో బాధపడుతున్నాడు.
దవాఖానలో చికిత్స చేయించుకున్నా రోగం తగ్గకపోవడంతో జీవితంపై విరక్తి చెంది తన వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు ఈశ్వర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.