న్యాల్కల్, జనవరి 14: మండలంలోని గ్రా మాల్లో ప్రజలు ఆనందోత్సవాల మధ్య భోగి పండుగను శనివారం ఘనంగా జరుపుకొన్నా రు. ఈ సందర్భంగా మండల కేంద్రమైన న్యా ల్కల్, హద్నూర్, మెటల్కుంట, గుంజోట్టి, వడ్డి, మిర్జాపూర్(ఎన్), న్యామతాబాద్, చా ల్కి, మామిడ్గి, రాజోలా, డప్పూర్, అత్నూర్, మరియంపూర్, రాఘవపూర్ తదితర గ్రా మా ల్లో ఇంటి ఎదుట చిన్నారులు, యువతులు, మహిళాలు రంగురంగుల ముగ్గులు వేసి అం దంగా అలంకరించారు. చిన్న పెద్ద తేడా లేకుం డా ప్రజలు పతంగులను ఎగురవేశారు. మండలంలోని రేజింతల్ సిద్ధివినాయక, ముంగి ఆదిలక్ష్మి, రాఘవపూర్లోని పంచవటి క్షేత్రం, మ ల్గి నవనాథ్ సిద్ధలింగేశ్వర ఆలయాల్లో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
సంప్రదాయానికి ప్రతీక ముగ్గులు
సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ముగ్గులని వాటి పరిరక్షణనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మండల కండ కార్యవాగ్ నర్సింహరెడ్డి అన్నారు. స్థానిక గ్రామంలోని హనుమాన్ ఆవరణలో శనివారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. చిన్నారులు, విద్యార్థినులు, యువతులు ము గ్గుల పోటీల్లో పాల్గొని రంగురంగుల ముగ్గుల ను వేశారు. ఈ ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో శ్రీకాంత్, రా ము, సతీశ్రెడ్డి, శివకుమార్ పాల్గొన్నారు.
అమీన్పూర్లో..
సంక్రాంతి పర్వదినం సందర్భంగా శనివారం అమీన్పూర్ మండల మున్సిపల్ పరిధిలోని ఘనంగా భోగి పండుగను జరుపుకొన్నారు. తెల్లావారుజామునుంచే కాలనీల్లో ప్రజలు భోగిమంటలు వేసుకొని సంబురాలు నిర్వహించారు. మహిళలు ఇండ్ల ఎదుట రంగవల్లులు వేసి కుటుంబమేతంగా సంతోషంగా గడిపారు.
మహిళలకు ముగ్గుల పోటీలు
సం క్రాంతి సందర్భంగా దోమడుగులో సర్పంచ్ రాజశేఖర్ శనివారం మహిళలకు ముగ్గుల పో టీలు నిర్వహించారు. దోమడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన ము గ్గుల పోటీలో మహిళా సమైక్య సంఘాల మహిళలు పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన ప్రథమ, ద్వితీ య, తృతీయ బహుమతుల కింద చీరలను సర్పంచ్ తన సొంత ఖ ర్చుతో అందజేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ స్వరూపరాంరెడ్డి, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.