రామచంద్రాపురం, అక్టోబర్ 31: ఆర్సీపురం డివిజన్లో ని హెచ్పీ ప్రెటోల్ బంక్ ఎదురుగా వర్షాలు కురిస్తే చాలు జాతీయ రహదారి చిత్తడిగా మారేది. ప్రతి వర్షాకాలంలో జాతీయ రహదారిపై చెరువుని తలపించే పరిస్థితి ఉండేది. భారీ వర్షాలు కురిసినప్పుడు జాతీయ రహదారిపై ప్రయా ణం చేసే పరిస్థితి ఉండేది కాదు.
పక్కనే రాయసముద్రం చెరువు ఉండటంతో వర్షాలకు చెరువుకి సంబంధించిన కా ల్వల నుంచి వచ్చే నీరు, వర్షపు నీరు జాతీయ రహదారిపైన నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు, వాహనదారుల రాకపోకలకు ఎంతో ఇబ్బందికరంగా ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో ఇ క్కడి ప్రజలు ఈ సమస్యలను చాలా సంవత్సరాలు ఎదుర్కొన్నారు. అప్పట్లో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాగం స్వయంగా వచ్చి సమస్యను పరిశీలించినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ఈ సమస్యకు మోక్షం కలిగింది. భారీ వర్షాల కారణంగా జాతీయ రహదారిపై నీరు నిలువడంతో విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్రావు స్వయంగా వచ్చి సమస్య ను పరిశీలించారు.
జాతీయ రహదారిపై నిలిచిన వర్షపు నీటి లో నడుస్తూ సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, కార్పొరేటర్లు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాక్స్డ్రైన్ నిర్మిస్తే సమస్య పరిష్కారమవుతుందని మంత్రి దృష్టికి తీసుకురావడంతో ఆయన స్పందించి బాక్స్డ్రైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. బాక్స్డ్రైన్ నిర్మాణం చేసేందుకు రహదారికి పక్కనే ఉన్న భూ యజమానులను ఒప్పించి సుమారుగా రూ. 2కోట్ల వరకు మం జూరు చేయించి బాక్స్డ్రైన్ నిర్మాణం చేపట్టారు.బాక్స్డ్రైన్ నిర్మాణం జరుగడంతో సమస్య పరిష్కారమైంది. భారీ వర్షాలు కురిసినా జాతీయ రహదారిపైన వర్షపు నీరు నిలువడం లేదు. దీంతో ప్రయాణం సాఫీగా సాగుతుంది.