-సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్
సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 26: జిల్లాలోని మున్సిపాలిటీల్లో అవసరమైన మేరకు నీటి సరఫరా జరగాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సదాశివపేట, సంగారెడ్డి, జహీరాబాద్ మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ కింద పెండింగ్లో ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో అర్భన్ మిషన్ భగీరథపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో నిర్మిస్తున్న వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ల పనుల వివరాలు సేకరించగా కేవలం జహీరాబాద్లో మా త్రమే పనులు పూర్తయ్యాయని, మిగతా మున్సిపాలిటీల్లో పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని మున్సిపాలిటీలలో త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. లేనియెడల తగిన చర్యలు తీసుకుంటమన్నారు. మహాప్రస్థానం పనులు కేవలం సదాశివపేట మున్సిపాలిటీలో పూర్తి కాగా, నారాయణఖేడ్, తెల్లాపూర్, అమీన్పూర్లలో పను లు చివరి దశలో ఉన్నాయని వివరించారు.
డిసెంబర్ 20లోగా పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలన్నారు. బొల్లారం, జహీరాబాద్ మున్సిపాలిటీల్లో పనులు ఎక్కువగా పెండింగ్లో ఉన్నాయని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. వచ్చే జనవరిలోగా పనులు పూర్తి చేయాలన్నారు. సంగారెడ్డిలో మంజూరైన రెండు మహాప్రస్థానం పనులు ప్రారంభించనందుకు అగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. టీయూఎఫ్ఐడీసీ పథకంలో మంజూరైన పనులు ఇంకా సంగారెడ్డి, అందోల్, నారాయణఖేడ్, సదాశివపేట మున్సిపాలిటీల్లో పెండింగ్లో ఉన్న పనులు వేగంగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.