గుమ్మడిదల, నవంబర్ 25: దేశానికి ఆదర్శంగా తెలంగాణ పల్లెలు నిలుస్తున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం బొంతపల్లిలో రూ.2.88కోట్లతో అభివృద్ధి చేసిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ప్రారంభించారు. వీరన్నగూడెంలోని బొంతపల్లి అయ్యప్పస్వామి దేవాలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే రూ. 16 లక్షల పైచిలుకు సొంతనిధులతో సీసీ పనులు పూర్తి కావడంతో వాటిని పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రభు త్వం అందించే నిధులతో పాటు స్థానిక పరిశ్రమల సహకారంతో శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నా రు. రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. రాష్ట్రం లో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. గ్రామం లో నిర్వహించిన అయ్యప్పస్వామి మహా పడిపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
కార్యక్రమలో ఎంపీపీ సద్దిప్రవీణ, జడ్పీటీసీ కుమార్గౌడ్, బొంతపల్లి సర్పంచ్ ఆలేటి నవీనాశ్రీనివాస్రెడ్డి, దోమడుగు సర్పంచ్ రాజశేఖర్, ఉపసర్పంచ్ సంజీవరెడ్డి, ఎంపీటీసీలు నాగేందర్గౌడ్, కొత్తపల్లి ప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోవర్ధన్రెడ్డి, నరేందర్రెడ్డి, గటాటి భద్రప్ప, పొన్నబోయిన వేణు,గౌరీశంకర్గౌడ్, మండల అధ్యక్షుడు మహ్మద్హుస్సేన్, గ్రామ కమిటీ అధ్యక్షుడు ముద్దంగుల గోపాల్, మంగయ్య, గటాటి రమేశ్, చక్రపాణి, వినోద్గౌడ్, గ్యారల మల్లేశ్, సుంకరి శంకర్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
నిరుపేద కుటుంబానికి ఎమ్మెల్యే సాయం
వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన తీగల యాదగిరి అనారోగ్యంతో మృతి చెందడంతో ఈవిషయం స్థానిక టీఆర్ఎస్ నాయకులతో తెలుసుకున్న ఎమ్మెల్యే తక్షణ సాయంగా రూ.10 వేలు సాయాన్ని పంపించారు. ఈ సాయాన్ని సర్పంచ్ రేణుకస్వామి, ఎంపీటీసీ పార్వతమ్మ,గ్రామకమిటీ అధ్యక్షుడు శివకుమార్ అందజేశారు.