నారాయణఖేడ్, నవంబర్ 25: ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ నాయకత్వంలో టీయూడబ్ల్యూజే(హెచ్143) జర్నలిస్టులకు అండగా నిలిచి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నదని సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీధర్గౌడ్ అన్నా రు. శుక్రవారం నారాయణఖేడ్లో సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరిగౌడ్, తెమ్జూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు దారాసింగ్, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి యోగానందరెడ్డితో కలిసి టీయూడబ్ల్యూజే(143) సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడుతున్నట్లు చెప్పారు. జనవరి 8న నిర్వహించనున్న రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక సంఘం నాయకులు అమృతం, మధుసూదన్రెడ్డి, వెంకట్రాములు, పరమేశ్, గోవర్ధన్రెడ్డి, శ్రీకాంత్, వెంకట్, డానియల్, రాములు, నర్సింహులు, దత్తులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని టీయూడబ్ల్యూజే(హెచ్ 143) అందోల్ నియోజకవర్గం గాజుల పవన్ అన్నారు. శుక్రవారం జోగిపేటలో యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు జర్నలిస్టులకు ఆయన సభ్యత్వాలు అందజేశారు. జనవరిలో రాష్ట్రమహాసభలు ఉంటాయ ని ఆ లోపు సభ్యత్వ నమోదు పూర్తిచేసి మహాసభలకు హాజరుకావాలన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రధానకార్యదర్శి యాదగిరిగౌడ్, సంఘం నాయకులు యోగానంద్రెడ్డి, ధారసింగ్, శ్రీధర్, ఉమాశంకర్, సందీప్, రాజేశ్, కుమార్, అనిల్ పాల్గొన్నారు.