సంగారెడ్డి/నిజాంపేట/కల్హేర్, నవంబరు 3: చలికాలం ప్రారంభంలోనే దట్టంగా పొగమంచు అలుముకోవడంతో ప్రజలు, విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం ఉదయం 5:30గంటల నుంచి జిల్లా కేంద్రం సంగారెడ్డి పట్టణంలో రెండు గంటల పాటు పొగమంచు దుప్పటి కమ్ముకున్నది. దీంతో ఉదయాన్నే పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, వాహనదారులకు రహదారి కనిపించక ఇబ్బందులు పడ్డా రు. 7:30గంటల అనంతరం పొగమంచు తగ్గిపోవడంతో ప్రజలు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. రోజురోజుకు పెరుగుతున్న చలి కారణం గా శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులు, చిన్నారులు ఉదయం వేళలో బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు.
కమ్మేసిన పొగ మంచు
చలి తీవ్రమవుతుంది. సాయంత్రం ఆరు నుంచే చలి గాలులు వీస్తున్నా యి. ఉదయం ఎనిమిది దాటినా చలి తీవ్రత తగ్గ డం లేదు. దట్టంగా పొగ మంచు కమ్మేస్తుండటం తో వాహనాల రాకపోకలకు అంతరా యం ఏర్పడుతున్నది. శుక్రవారం ఉదయం ఎనిమిది గంట లు దాటినా వాహనదారులు లైట్లు వేసుకుని బం డ్లు నడుపాల్సి వచ్చింది.