సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 27: జిల్లాలో 2లక్షల 52 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వ చ్చే అవకాశం ఉన్నదని సంగారెడ్డి కలెక్టర్ శరత్ పేర్కొన్నారు. ఆయా కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం కొనుగోళ్లు సజావు గా జరగాలని అధికారులను ఆదేశించారు. గురువారం ధా న్యం కొనుగోలుపై కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలు, బుక్ కీప ర్స్, ఏఈవోలు, సిట్టింగ్ ఆఫీసర్లు, రైస్మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలతో సమావేశమై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లు లేకుండా, రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. రైతులు కనీస మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునేలా అన్ని ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటికే కొనుగోళ్లు ప్రారంభమైనట్టు కలెక్టర్ వెల్లడించారు. ఏ గ్రేడ్ రకం ధాన్యానికి రూ. 2,060, సాధారణ రకం ధాన్యానికి రూ. 2,040ల మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు.
జిల్లాలో 257 కొనుగోలు కేంద్రాలు
జిల్లాలో మొత్తం 257 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఐకేపీ, డీసీఎంఎస్ల ఆధ్వర్యంలో ఈ కొనుగోలు కేంద్రాలు పని చేస్తాయని వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను గ్రామానికి ఒకటి ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పెద్ద గ్రామం అయితే అవసరం మేరకు రెండు కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అదే విధం గా కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన టార్ఫాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తేమను కొలిచే యంత్రాలు, డిజిటల్ కాంటాలు, గోనె సంచులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ధాన్యా న్ని రైస్మిల్లులకు తరలించడానికి వీలుగా ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్స్ అవసరమైనన్ని లారీలను నడుపాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని 4గంటల లోపు లోడింగ్ చేయాలన్నారు. రైస్ మిల్లుల వద్ద 6గంటల లోపు ఎప్పటికప్పుడు అన్లోడ్ కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. రైస్ మిల్లు ల కాంటాల వద్ద తూకంలో అవకతవకలు జరుగకుండా చూ డాల్సిందిగా లీగల్ అండ్ మెట్రాలజీ అధికారికి సూచించారు. 17శాతం తేమ మించకుండా, తాలు లేకుండా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ విస్తరణ అధికారులకు సూచించారు. సహా య వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులతో సమన్వయం చేసుకుంటూ కేంద్రాలకు ఎంత ధాన్యం వచ్చేది కచ్చితమైన వివరాలు అందించాలని వ్యవసాధికారిని ఆదేశించారు. రోజువారి నివేదికను ఆయా అధికారులు ఇవ్వాలని, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం కలిసి రూపొందించిన నివేదికను ఇవ్వాలని స్పష్టం చేశారు.
సకాలంలో డబ్బులు జమ చేయాలి
కొనుగోలు కేంద్రాల్లో ఎప్పటికప్పుడు లారీల్లో తరలించేందుకు హామీలను ఏర్పాటు చేసుకోవాలని, రైతులకు డబ్బులు సకాలంలో వారి ఖాతాలో జమ చేసేందుకు ఏ రోజుకారోజు కొనుగోళ్లకు సంబంధించిన ట్రక్ షీట్, ట్యాబ్ ఎంట్రీ చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో కేం ద్రం ఇన్చార్జి, సిట్టింగ్ అధికారి, టాబ్ ఎంట్రీ ఇన్చార్జి తదితరులు విధిగా ఉండాలన్నారు. రెవెన్యూ డివిజనల్ అధికారులు, అదనపు కలెక్టర్ పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించాలని సూచించారు. అందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. బయటి నుంచి ధాన్యం రాకుండా నిఘా పెం చాలన్నారు. కొనుగోళ్ల ప్రక్రియ ముగిసే వరకు అధికారులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. అనంతరం వానాకాలం వరి ధాన్యం మద్ధతు ధరకు సంబంధించి న పోస్టర్ను కలెక్టర్ విడుదల చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, డీఆర్డీవో శ్రీనివాసరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ సుగుణబాయి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి నర్సింహరావు, డీసీవో ప్రసా ద్, రవాణ, మార్కెటింగ్, రెవెన్యూ అధికారులు, తహసీల్దా ర్లు, రైస్ మిల్లర్లు, ట్రాన్సోర్ట్ ఏజెన్సీలు, కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలు, ఏఈఓలు, బుక్కీపర్లు, అధికారులు పాల్గొన్నారు.