సంగారెడ్డి అర్బన్, మే17: మామిడి సాగును పెంచి అధిక దిగుబడులు సాధించేందుకు సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రంలో మంగళవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. 265 రకాల మామిడి పండ్లు, కాయలను ప్రదర్శనలో ఉంచడంతో పాటు వాటి రకాలపై రైతులకు వివరించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ నీరజా ప్రభాకర్, సీనియర్ ఫల శాస్త్రవేత్తలు కిరణ్కుమార్, భగవాన్ పాల్గొన్నారు. ఫలరాజైన మామిడి సాగుకు మన రాష్ట్రంలోని వాతావరణం చాలా అనుకూలంగా ఉండి మంచి నా ణ్యమైన దిగుబడిని ఇస్తుందని, ఈసాగుపై రైతాంగం అవగాహన పెంచుకోవాలని వారు సూచించారు. వాతావరణ పరిస్థితులు, వాటి ప్రభావం, పూత, ఖాత, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. రాష్ట్రంలో పండించే మామిడి పండ్లను మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల వారు కూడా దిగుమతి చేసుకొని ఇష్టంగా తింటున్నారని, మామిడిసాగు విస్తీర్ణం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యానవన పంటలకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
నిలువ ఆధారిత పంటలను ఉత్పత్తి చేసుకోవడం చాలా అవసరమన్నారు. మొక్కలను ఎక్కు వ పెంచడం, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించడం, సమగ్ర విధానంలో క్రిమి కీటకాలను నివారించ డం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర వాటిపై రైతులను చైతన్య పరిచారు. అనంతరం కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ నీరజ ప్రభాకర్ మాట్లాడుతూ మామిడి సాగులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం 9వ స్థానం లో ఉందన్నారు. 2లక్షల 51వేల ఎకరాల్లో మామి డి సాగు రాష్ట్రంలో ఉన్నదని, ఎకరాకు 3నుంచి 4 టన్నుల కాయలు కాస్తాయన్నారు. వాతావరణంలో వచ్చే మార్పులతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిందని, మార్పులను ఎదుర్కొని దిగుబడి పెంచే విధంగా శాస్త్రవేత్తల పరిశోధనలు జరుగుతాయని వెల్లడించారు. రాష్ట్రంలో ఫలాలను కేవలం 2శాతం వరకే తీసుకుంటున్నారని, ఈ శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. నా ణ్యత పండ్లను ఉత్పత్తి చేయడంలో రైతులు వెనకబడి ఉన్నారని, ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్నారు. అంతకుముందు అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు మామిడి పండ్ల ప్రదర్శనను తిలకించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి సునీత, శాస్త్రవేత్త రాజుకుమార్, అధికారులు, రైతులు పాల్గొన్నారు.