సంగారెడ్డి, ఏప్రిల్ 8: రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా “హరిత హారం” కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. 2015లో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తూ విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు విడుతల్లో నాటిన మొక్కలు చెట్లుగా పెరిగి పచ్చదనాన్ని అందిస్తున్నాయి. కాగా, వచ్చే వర్షాకాలంలో ఎనిమిదో విడుతకు అధికారులు మొక్కలను సిద్ధం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 1,07,26,500 కోట్ల మొక్కలు నాటేందుకు అందుబాటులో ఉంచా రు. మొత్తం 647 గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో హరితహారం మొక్కలను సిద్ధం చేశారు. ఈ ఏడాదిలో 50,18,981 లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు లక్ష్యం పెట్టుకున్నారు. జాతీ య ఉపాధిహామీ పథకంలో నర్సరీలను ఏర్పా టు చేసి మానవాళికి ఉపయోగపడే పండ్లు, పూ లు, ఔషధ, సుగంధ ద్రవ్యాలు వంటి 77 రకాల మొ క్కలను ఎనిమిదో విడుతకు కోసం పెంచుతున్నారు. ప్రభుత్వ శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించి మొక్కలు నాటాలని ఇదివరకే సంబంధిత శాఖలకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశా రు. ప్రత్యేకంగా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందితో నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేసి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. కాగా, వర్షాలు రాగానే మొక్కలు నా టేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
అందుబాటులో 1.07 కోట్లు..
ఎనిమిదో విడుత హరితహారంలో మొక్కలు నా టేందుకు సంగారెడ్డి జిల్లాలోని నర్సరీల్లో 1,07,26,500 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. జిల్లాలో నాటేందుకు 50,18,981 లక్షల మొక్కలు లక్ష్యంగా పెట్టుకోగా, 1.07 కోట్ల మొక్కలు అందుబాటు లో ఉన్నాయి. జిల్లాలో 639 ఈజీఎస్ పాండ్స్ లో మొక్కలు పెంచగా, అమీన్పూర్ మండంలోని 8 గ్రామ పంచాయతీ నర్సరీల్లో 77 రకాలు మొక్కలు పెంచి హరితహారంలో నాటనున్నారు. నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలు ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న కూలీలు, అధికారులు, సిబ్బందికి అప్పగించారు.
ఒక మొక్క సంరక్షణకు రూ.3
హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కల సంరక్షణకు ఒక మొక్కకు నెలకు రూ.3 చొప్పున ప్రభుత్వం అందజేస్తున్నది. మొక్కల రక్షణకు బాధ్యత తీసుకున్న కూలీల వివరాలను క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ అధికారులు, సిబ్బంది పర్యవేక్షించి వారి ఖాతాల్లో డబ్బులను జమ చేస్తున్నారు. మొక్కలను పెంచే బాధ్యత తీసుకుని వదిలేస్తే చట్టపరమైన చర్యలకు వెనకాడబోమని అధికారులను హెచ్చరించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా గుంతకు రూ.17, నాటేందుకు రూ.4, నర్సరీల్లో మొక్క పెంచేందుకు రూ.9 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తున్నది.
మొక్కలు నాటేందుకు ప్రణాళికలు..
పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా జిల్లాలోని అన్ని ప్రదేశాల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు అధికారులు. ఎనిమిదో విడుతలో రోడ్ల పక్కలా 3.50 లక్షల మొక్కలు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, దేవాలయాలు, ప్రార్థన మందిరాలు, చర్చిల ఆవరణలో 10లక్షలు, రైతులకు టేకు, పండ్ల, ఫలాలు, పొలం గట్లపై 22లక్షలు, ఇంటికి 6 మొక్కల చొప్పున 15లక్షలు, విద్యా సంస్థలు 1.20లక్షలు, అడవుల్లో హరిత వనాలు 5లక్షలు, చెరువులు, శిఖం భూముల్లో 3లక్షలు, ఇతర ప్రాంతాల్లో మొత్తం 55 లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. గతేడాది నాటిన మొక్కల్లో తప్పిపోయిన ప్రాంతాలు 2.50లక్షల చొప్పున మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వశాఖలకు కేటాయించిన లక్ష్యాల చొప్పున మొక్కలు నాటి సంరక్షణ చేసే బాధ్యతను ఆయా శాఖలకు అప్పగించారు. దీంతో ఎనిమిదో విడుత హరితహారం కార్యక్రమంలో 98 శాతం మొక్కలు నాటి బతికించడానికి అధికారులు పక్కా ప్రణాళికలు తయారు చేసి అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
ప్రభుత్వ ఆదేశాలు రాగానే ప్రారంభం…
ప్రభుత్వం నుంచి ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమానికి ఆదేశాలు రాగానే మొక్కలు నాటుతాం. జిల్లాలో పెట్టుకున్న లక్ష్యం మేరకు 77 రకాల మొక్కలు సిద్ధం చేశాం. గ్రామాల్లో ఈజీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో పెంచిన మొక్కలు నాటేందుకు అందుబాటులో ఉంచాం. జిల్లాలో 50.18 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యం పెట్టుకోగా, అందుబాటులో 1.07 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి.
– శ్రీనివాస్రావు, డీఆర్డీవో సంగారెడ్డి