సంగారెడ్డి, మార్చి 20 : సదాశివపేట మున్సిపల్కు చెందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఇద్దరు, కంది మండలం కవలంపేటకు సర్పంచ్, ఉప సర్పంచ్లతోపాటు వార్డు సభ్యులు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లోని హరీశ్రావు నివాసానికి వెళ్ల్లి గులాబీ కండువాలు వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 10వ వార్డు కౌన్సిలర్ సతాని లలితా శ్రీశైలం, 22వ వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ నాయక్తోపాటు సర్పంచ్ షఫీబాబా, ఉపసర్పంచ్ మల్లేశ్, సభ్యులు షరీఫ్, ఆజాద్, సీనియర్ నేత ఒమర్ బాబా టీఆర్ఎస్లో చేరారు. సదాశివపేట మున్సిపల్లో కాంగ్రెస్ తరపున 9 మంది గెలిచారు. ప్రస్తుతం మున్సిపల్లో నలుగురు మాత్రమే ఉన్నారు. గ్రామాభివృద్దే లక్ష్యంగా కంది మండలం కవలంపేట సర్పంచ్ తనతోపాటు ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో కలిసి టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సదాశివపేట పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తా నన్నారు. పార్టీలో అందరికీ తగిన స్థానం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, కంది జడ్పీటీసీ కొండల్రెడ్డి, ఎంపీపీ సరళ, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, కౌన్సిలర్లు ఇంద్రమోహన్గౌడ్, విశ్వనాథం, విద్యాసాగర్రెడ్డి, చౌదరి ప్రకాశ్, రాజుముదిరాజ్, నసీరుద్దీన్, మీబిన్ సమీయొద్దీన్, శివకుమార్, రవి, సత్యంగౌడ్, సర్పంచ్ గోపాల్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, నాయకులు వీరేశం, అంజయ్య, విజయేందర్రెడ్డి, చిల్వరి ప్రభాకర్, కాసాల రాంరెడ్డి పాల్గొన్నారు.