అందోల్, జూన్ 21 : తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఊపిరి పోసిన మహానాయకుడు ఆచార్య జయశంకర్ అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా సోమవారం అందోల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతికిరణ్తో జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ తొలి, మలి దశ ఉద్యమంలో తెలంగాణ భావజాలాన్ని కాపాడిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని అన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి.. మెప్పించడంలో సీఎం కేసీఆర్ కృషికి తోడై నిలిచిన వ్యక్తి జయశంకర్ సార్ అని ఆయన సేవలను గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రాజెక్టులు నిర్మించుకొని మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి దేశంలోనే ఇవాళ నంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, జాగృతి రాష్ట్ర కార్యదర్శి భిక్షపతి, ఏఎంసీ చైర్మన్ మల్లికార్జున్, మున్సిపల్ చైర్మన్ మల్ల య్య, తాలెల్మ ఎత్తిపోతల పథకం చైర్మన్ లింగాగౌడ్, ఎంపీపీ బాలయ్య, మాజీ ఎంపీపీ రామాగౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రవీణ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేశం పాల్గొన్నారు.
తెలంగాణ సిద్ధాంతకర్తకు ఘన నివాళి..
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. ఆర్సీపురం డివిజన్లోని ఆర్సీపురం చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పానగేశ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతీనగర్ డివిజన్లోని ఎల్ఐజీలో ఉన్న వార్డు కార్యాలయంలో కార్పొరేటర్ సింధూఆదర్శ్రెడ్డి ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు వేర్వేరుగా మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కళలను సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్సీపురం, భారతీనగర్ డివిజన్ల అధ్యక్షులు పరమేశ్యాదవ్, దేవేంద్రాచారి, మాజీ కార్పొరేటర్ అంజయ్య, నాయకులు మోహన్రెడ్డి, మల్లేశ్, యాదయ్య, నర్సింగ రావు, యాదగిరిరెడ్డి, నర్సింహాచారి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ సార్కు నివాళి..
ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా పటాన్చెరు పట్టణంలో ఉన్న ఆయన విగ్రహానికి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారికవిజయ్కుమార్, ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హారిక మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్సార్ అని కొనియాడారు. కార్యక్రమంలో శ్రీధర్చారి, శ్రీను, అశోక్, అఫ్జల్, మతి న్, వినోద్, వీరారెడ్డి, విద్యాసాగర్ పాల్గొన్నారు.