సంగారెడ్డి : కొద్ది రోజులుగా తెలంగాణలో విస్తారంగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ప్రాజెక్ట్లన్నీ నిండు కుండల్లా మారాయి. కాగా, సింగూరు ప్రాజెక్టుకు వరద తగ్గు ముఖం పట్టింది. గత నెల రోజులుగ ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు లోకి వరద ఉధృతి భారీగా కొనసాగింది. కాగా, గురువారం సాయంత్రం వరద తగ్గు ముఖం పట్టడంతో ప్రాజెక్టు అధికారులు అన్ని గేట్లను మూసివేశారు.