ఝరాసంగం, జనవరి11: కరోనా కట్టడిలో భాగంగా ఫ్రంట్లైన్ వర్కర్లు, 60 ఏండ్లు పైబడిన వారు బూస్టర్ డోస్ వేయించుకోవాలని వైద్యాధికారి మాజీద్ సూచించారు. మంగళవారం ఝరాసంగం ప్రభుత్వ దవాఖానలో 22 మంది ఉద్యోగులకు కొవిడ్ బూస్టర్ డోస్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారు నిర్లక్ష్యం చేయకుండా బూస్టర్ డోస్ వేయించుకోవాలన్నారు. 15 నుంచి 18 ఏండ్ల వారు కూడా కరోనా టీకా వేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
గుమ్మడిదలలో..
మండలంలోని వీరన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని వారికి మంగళవారం గుమ్మడిదల పీహెచ్సీ వైద్య బృందం అరుంధతి ఆధ్వర్యంలో బూస్టర్ డోస్ వేసే కార్యక్రమాన్ని సర్పంచ్ మమతావేణు, ఉపసర్పంచ్ కుమార్, ఎంపీటీసీ నాగేందర్గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు డోస్లు తీసుకున్న వారు బూస్టర్ డోస్ వేయించుకోవాలన్నారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతికదూరం పాటించాలని సూచించారు.
బూస్టర్ డోస్ వేయించుకున్న ఎంపీడీవో
మండలంలోని రుద్రారం గ్రామ పంచాయతీలో ఆరోగ్యశాఖ అధికారులు ఫ్రంట్లైన్ వారియర్స్ కోసం ఏర్పాటు చేసిన బూస్టర్ డోస్ వేసే కార్యక్రమాన్ని పటాన్చెరు ఎంపీడీవో బన్సీలాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త వేరియంట్ నుంచి రక్షణ కోసం బూస్టర్డోస్ వేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ సుధీర్రెడ్డి, ఆరోగ్య, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.