హత్నూర (సంగారెడ్డి) : ప్రజల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి నిరంతరం పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టాలని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి (Mla Madan Reddy) తెలిపారు. గురువారం హత్నూర మండలం రెడ్డిఖానాపూర్లో రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ (CM KCR) నేతృత్వంలో ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి (Peoples Welfare) పెద్దపీట వేస్తుందని అన్నారు.
దేశంలో ఎక్కడాలేనివిధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేస్తుందని గుర్తుచేశారు. ఎన్నో వినూత్న పథకాలకు (Schemes) శ్రీకారంచుట్టి అమలుచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వాల హయంలో నర్సాపూర్ నియోజకవర్గం ఎంతో వెనకబడిపోయిందని పేర్కొన్నారు. పార్టీలకతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తున్న తనకు ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రజల ఆశీర్వాదంతో మరింత అభివృద్ధిని సాధిస్తానని తెలిపారు. ఎన్నికల సమయంలోనే ప్రజల్లోకి వచ్చి కల్లబొల్లి మాటలుచెపుతూ ఓట్లు దండుకోవాలని చూసే ప్రతిపక్ష పార్టీలను ( Oppsition Partys) నమ్మవద్దని సూచించారు. కార్యక్రమంలో మెదక్జిల్లా గ్రంథాయల సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, ఎంపీపీలు నర్సింహులు, హరికృష్ణ, పీఏసీఎస్ చైర్మన్లు దామోదర్రెడ్డి, దుర్గారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాయకులు సుధీర్రెడ్డి, కిషోర్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.