నారాయణఖేడ్ : ఓట్ల కోసం ప్రజలను మభ్య పేట్టే ప్రయత్నం చేస్తున్న పార్టీలకు గుణపాఠం చెప్పాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి (MLA Bhupal reddy ) అన్నారు. దివ్యాంగుల పింఛన్ను రూ.3,016 నుండి 4,016లకు పెంచిన నేపథ్యంలో మంగళవారం నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని దివ్యాంగులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా కేసీఆర్ (CM KCR ) ప్రభుత్వం పింఛన్లను అందజేస్తుందన్నారు. తాను ఇటీవల ముంబయిలో జరిగిన లేజిస్లేచర్ కాన్ఫరెన్స్కు వెళ్లిన సందర్భంగా అక్కడికి వచ్చిన అన్ని రాష్ట్రాల ప్రతినిధులు తెలంగాణలో ఇస్తున్న అత్యధిక పింఛన్లపై ప్రశంసించడం తనకెంతో గర్వంగా ఉందన్నారు.
దివ్యాంగుల పింఛన్ను మరో వెయ్యి అదనంగా పెంచి సీఎం కేసీఆర్ తన పెద్ద మనసును చాటుకున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రతి పథకాన్ని అవినీతిమయం చేసి జేబులు నింపుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం పారదర్శకంగా పథకాలను అమలు చేసి, నేరుగా లబ్ది చేకూరుస్తుందన్నారు. సుపరిపాలనను కోరుకునే వారు వచ్చే ఎన్నికల్లోనూ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదీంచాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ పరశురామ్, మునిస్పల్ కమిషనర్ మల్లారెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.