సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 9: 75వ భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం సంగారెడ్డిలో నటరాజ్ థియేటర్లో విద్యార్థులకు మహాత్మాగాంధీ సినిమాను చూపించారు. ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్, జడ్పీ చైర్పర్సన్ మంజూశ్రీ జైపాల్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, కలెక్టర్ శరత్, ఇతర జిల్లా అధికారులు విద్యార్థులతో కలిసి గాంధీ సినిమాను చూశారు. అంతకుముందు కంది మండలం చేర్యాల్ గ్రామంలో జడ్పీహెచ్ఎస్ విద్యార్థులను సినిమాకు తరలించే ప్రత్యేక బస్సును జెండా ఊపి ప్రారంభించారు. అదే బస్సులో విద్యార్థులతో కలిసి సినిమా హాల్కు చేరుకున్న ఎంపీలు విద్యార్థులకు గులాబీ పూలను అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, రాజర్షిషా, సంగారెడ్డి తహసీల్దార్స్వామి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నరహరిరెడ్డి, కంది ఎంపీపీ సరళాపుల్లారెడ్డి, జడ్పీటీసీ కొండల్రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాలు ఎగురవేయాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి గృహ యాజమానులకు సూచించారు. పెద్దశంకరంపేట పట్టణంలోని పాత గ్రామ పంచాయతీ ఆవరణలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఇంటింటికీ జాతీయ జెండాలు పంపిణీ చేశారు. వజ్రోత్సవాల్లో భాగంగా ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మె ల్యే చంటిక్రాంతికిరణ్ జోగిపేటలో ఇంటింటికీ జెండాలు పంపిణీ చేసి ప్రతి ఒక్కరూ తమ ఇండ్లపై జెండాలు ఎగురవేయాలని సూచించారు. ఈ సందర్భంగా జోగిపేట పట్టణానికి చెందిన స్వాతం త్య్ర సమరయోధులు లింగమయ్యగౌడ్ సన్మానించి సత్కరించారు. నర్సాపూర్లో ఎమ్మెల్యే మదన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనసూయ అశోక్గౌడ్తో కలిసి ఇంటింటికీ జాతీయజెండాల పంపిణీ చేశారు.
సంగారెడ్డి కొత్త బస్టాండ్లో జాతీయ గీతాలాపణ
సంగారెడ్డి అర్బన్, ఆగస్టు9: వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని బస్టాండ్లలో ప్రతి రోజు ఉదయం 11గంటలకు జాతీయ గీతాలాపణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్ఎం ఎన్. సుదర్శన్ పేర్కొన్నా రు. మంగళవారం సంగారెడ్డి కొత్త బస్టాండ్తో పాటు ఆర్టీసీ కార్యాలయంలో జాతీయ గీతాలాపణ చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ స్వతంత్య్ర వజ్రోత్సవాలను జరుపుకోవడం చాల సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమం లో డిప్యూటీ ఆర్ఎం జోత్స్న, డీఎం సత్యనారాయణ, ప్రయాణికులు పాల్గొన్నారు.