సదాశివపేట, అక్టోబర్ 22 : ఇండ్లల్లో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు సదాశివపేట సీఐ సంతోష్కుమార్ తెలిపారు. శుక్రవారం సదాశివపేట పట్టణంలోని పోలీసు స్టేషన్లో నిందితుడిని మీడియా ముందు హాజరుపర్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 21వ తేదీన సదాశివపేట పట్టణానికి చెందిన గడ్డం లలిత ఇంట్లో దొంగలు పడి బంగారం, నగదు దొంగలించారని ఫిర్యాదు వచ్చిందన్నారు.
దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా సదాశివపేట పట్టణం చాకలికేరిలో నివాసం ఉండే మాదిగ లాలెప్ప(లాలు) అను వ్యక్తిని విచారించగా తానే దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారని సీఐ తెలిపారు.