బొల్లారం, నవంబర్ 1 : బొల్లారం మున్సిపాలిటీ పరిధి నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు సోమవారం పట్టుకున్నారు. సీఐ ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం..ఐడీఏ బొల్లారం నుంచి ట్రాలీ ఆటోలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా ఎస్ఐ చంద్రయ్య, సిబ్బందితో కలిసి వాహనాన్ని తనిఖీ చేశారు.
సుమారుగా 10 నుంచి 15 క్వింటాళ్ల బియ్యం పట్టుబడ్డాయి. వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పట్టుబడిన రేషన్ బియ్యాన్ని పటాన్చెరు పట్టణంలోని సీవిల్ సైప్లె గోదాంకు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రశాంత్ తెలిపారు.