జిన్నారం, డిసెంబర్ 1 : రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మండలంలోని సోలక్పల్లి గ్రామంలో పునర్నిర్మించిన బొజ్జ గణపతి ఆలయంలో బుధవారం నిర్వహించిన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి దంపతులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన హోమాలు, ప్రత్యేక అర్చనలు, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలలో పాల్గొని పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రధాన్యతను ఇస్తున్నదన్నారు. అదే కోవలో నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాలు చేపడుతున్నట్లు చెప్పారు. పురాతన దేవాలయాలను జీర్ణోద్ధరణగావిస్తున్నట్లు చెప్పారు. గ్రామస్తులందరు కలిసి ఆలయా నిర్మాణాలకు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
విగ్రహకు ప్రతిష్టకు హాజరైన వారిలో జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ రవీందర్గౌడ్, స్థానిక సర్పంచ్ శ్రీకాంత్రెడ్డి, ఎంపీటీసీ స్వాతిప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు చంద్రారెడ్డి, వెంకటేశంగౌడ్, గుమ్మడిదల జడ్పీటీసీ కుమార్గౌడ్ తదితరులు ఉన్నారు.