జిన్నారం, మార్చి 28 : ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రం జిన్నారం ఎస్సీ కాలనీలో పోచమ్మ ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. ఇందుకు యాదాద్రి ఆలయమే నిదర్శనమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ బాటలోనే ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఆలయాల నిర్మాణాలకు తనవంతు సహాయం అందిస్తున్నానని చెప్పారు. పోచమ్మ తల్లి దయతో అందరు సంతోషంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశంగౌడ్, సర్పంచ్ లావణ్య, ఎంపీటీసీ లావణ్య, పార్టీ మండల అధ్యక్షుడు రాజేశ్, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.