సంగారెడ్డి అర్బన్, ఏప్రిల్ 27 : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు జిల్లాకేంద్రం సంగారెడ్డిలో ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు డు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లావాప్తంగా పార్టీ శ్రేణులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. సంగారెడ్డి పట్ట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట టీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీని స్థాపిం చి, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమనాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిచ్చి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. సంగారెడ్డిలోని 4వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి జెండాను ఆవిష్కరించారు. వేడుకల్లో విజయేందర్రెడ్డి, వెంకటేశం, నర్సింహులు, శ్రీనివాస్రెడ్డి, విష్ణువర్ధన్, బీరయ్య యాదవ్, రామప్ప, జలేందర్, శ్రవణ్రెడ్డి, ప్రవీణ్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ కార్యకర్తల పార్టీ : ఎమ్మెల్యే గూడెం
పటాన్చెరు/పటాన్చెరు టౌన్, ఏప్రిల్ 27 : టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ వేడుకలను పారిశ్రామికవాడలో ఘనంగా నిర్వ హించారు. పటణంతోపాటు గ్రామాల్లో పార్టీ అధ్యక్షులు గులా బీ జెండాను ఆవిష్కరించి, సంబురాలను ప్రారంభించారు. ప టాన్చెరులో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పాల్గొనగా, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అఫ్జల్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీని ఉద్యమనాయకుడిగా సీఎం కేసీఆర్ 21ఏళ్ల క్రితం ప్రా రంభించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించే లక్ష్యం తో సుధీర్ఘకాలం పోరాటం చేసి, 2014లో రాష్ర్టాన్ని సాధించా రన్నారు. తెలంగాణ తొలి సీఎంగా కేసీఆర్ సబ్బండ వర్గాలకు న్యాయం చేస్తూ, రాష్ర్టాన్ని అభివృద్ధిలో దేశంలోనే ముందుంచారన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తల పార్టీ అని, కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యేక నిధులను కేటాయించారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, జడ్పీటీసీ సుధాకర్రెడ్డి, ఎంపీపీ సుష్మాశ్రీ, నేతలు గూడెం మధుసూధన్రెడ్డి, దశరథరెడ్డి, బసవేశ్వర్, విజయ్కుమార్ పాల్గొన్నారు.
నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో…
పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించడంతోపాటు కేక్ను కట్ చేసి సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు ప్రశాంత్, పీఏసీఎస్ చైర్మన్ నారాయణరెడ్డి, వార్డు సభ్యులు దుర్గయ్య, కృష్ణ, వెంకటేశ్ పాల్గొన్నారు.ముత్తంగిలో టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు రామ కృష్ణ ముదిరాజ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కార్యక్ర మంలో సర్పంచ్ ఉపేందర్ముదిరాజ్, ఆత్మకమిటీ చైర్మన్ గడీల కుమార్గౌడ్, వైస్ ఎంపీపీ స్వప్నాశ్రీనివాస్ పాల్గొన్నారు.