నంగునూరు/ జగదేవ్పూర్/కొండపాక/ మిరుదొడ్డి, ఫిబ్రవరి 9 : విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని మిరుదొడ్డి ఎక్సైజ్ సీఐ గాయత్రి అన్నారు. బుధవారం మిరుదొడ్డి టౌన్లోని ఆదర్శపాఠశాల/కళాశాలలో మాదకద్రవ్యా లు, గంజాయిపై అవగాహన కల్పించి విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సై జహీరుద్దీన్, సిబ్బంది ముజాబుద్దీన్, రామ్రాజ్, విజయ్, కిషన్ గౌడ్, గణేశ్, మౌనిక, సిబ్బంది ఉన్నారు. కొండపాక మండలం వెలికట్ట క్రాస్ రోడ్ వద్ద శ్రీ కృపా ఫార్మసీ కళాశాలలో బుధవారం ఎక్సైజ్ చేర్యాల సీఐ మహేందర్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మ త్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సైలు వినోద్కుమార్, సురేశ్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ పాల్గొన్నారు. జగదేవ్పూర్లోని జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై ఎక్సైజ్ ఎస్సై శ్రీనివాస్రెడ్డి అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రిన్సిపాల్ రాజన్న విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. ఎవరైనా డ్రగ్స్ ఉపయోగిస్తున్నట్లు తెలిస్తే 9492777012 నంబర్కు డయల్ చేయాలని వారు సూచించారు. నంగునూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీడీవో అధ్యక్షతన రాజగోపాల్పేట పోలీసుల ఆధ్వర్యంలో గంజాయి, మాదక ద్రవ్యాల నివారణపై ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సీహెచ్. విజయలక్ష్మి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.