సంగారెడ్డి : హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ప్రకటించడం పట్ల టీఆర్ఎస్వీ జిల్లా ఆధ్వర్యంలో సంబురాలు మిన్నంటాయి. స్వీట్లు పంచి పటాకులు కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఉద్యమ నాయకుడికి టికెట్ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ రాజేందర్ నాయక్, సంగారెడ్డి నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీహరి, జహీరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు రాకేష్, సంగారెడ్డి మండల్ అధ్యక్షుడు సందీప్, సంగారెడ్డి పట్టణ యువత అధ్యక్షుడు శ్రావణ్ రెడ్డి, టీఆర్ఎస్వీ నాయకులు రాము, లక్ష్మణ్, రోషన్, జగన్ నాయక్, చిన్న దినేష్ నాయక్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.