అందోల్, డిసెంబర్ 24 : క్రిస్మస్ పండుగ వేడకులను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శుక్రవారం అందోల్ క్యాంప్ కార్యాలయంలో క్రిస్మస్ బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత ప్రభుత్వాలకు భిన్నంగా ప్రభుత్వం పండుగలపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
పండుగల నిర్వహణకు అన్ని విధాలుగా సహాయ సహకరాలు అందించి అందరు సంతోషంగా జరుపుకునేలా చూస్తుందన్నారు. పండుగకు ప్రతి ఒక్కరు కొత్త బట్టలు వేసుకుని ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో బట్టలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
అదే విధంగా గ్రామాల్లోన్ని చర్చిల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ఎంతో కృషిచేస్తుందని చెప్పారు. రాష్ర్టాభివృద్ధికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషికి పక్క రాష్ర్టాలు సైతం అభినందిస్తున్నాయన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తున్న ముఖ్యంత్రి నిండు నూరేండ్లు ఆరోగ్యంగా ఉండాలని చర్చిలలో ప్రార్థనలు చేయాలన్నారు. అనంతరం అల్లాదుర్గం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ సిబ్బందికి స్మార్ట్ ఫోన్లను ఎమ్మెల్యే అందజేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, వైస్ చైర్మన్ ప్రవీణ్, ఏఎంసీ చైర్మన్ మల్లికార్జున్, తహసీల్దార్ అశోక్కుమార్, కౌన్సిలర్లు దుర్గేశ్, ఉల్వల మాధవి, ధనలక్ష్మి అనిల్, నాయకులు రవీందర్గౌడ్, సంతోశ్, రాజు పాల్గొన్నారు.