రామచంద్రాపురం, మార్చి15 : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో రూ.2.16కోట్లతో చేపట్టిన్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.
అనంతరం చైర్పర్సన్ లలిత వివాహా వార్షికోత్సవం సందర్భంగా సొంత ఖర్చుతో మహిళలకు కుట్టుమిషన్లు, విద్యార్థులకు బ్యాగులు, బూట్లు పంపిణీతో పాటు విద్యుత్నగర్లో చలివేంద్రం, ఉచిత అన్నదాన కేంద్రాన్ని చైర్పర్సన్తో కలిసి వారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలకు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా రూ.25కోట్లు నిధులు మంజూరు చేశారన్నారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో ప్రభుత్వం రాజీపడకుండా పని చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ మంజూరు చేసిన ప్రత్యేక నిధులను మున్సిపాలిటీ అభివృద్ధికి వినియోగించాలని సూచించారు.
ప్రతి వార్డులో పూర్తిస్థాయి మౌలికసదుపాయాలను కల్పించాలన్నారు. అందరు కలిసికట్టుగా పనిచేస్తేనే ప్రజా సమస్యలు వేగంగా పరిష్కారమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి, ఆర్సీపురం కార్పొరేటర్ పుష్ప, అమీన్పూర్ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్చైర్మన్ రాములుగౌడ్, ఏఎంపీ వైస్ చైర్మన్ మల్లారెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు దేవేందర్యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.