కల్హేర్, అక్టోబర్ 6 : ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ బైక్ పై వస్తున్న యువకుడిని ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన కల్హేర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఎస్ఐ ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. కల్హేర్ మండల పరిధిలోని బల్కం చెల్క తండాకు చెందిన మూడ్ గోపాల్ (29) పిట్లం మండలం చిన్న కొడ్పగల్లో మేనత్త ఇంట్లో భవాణి మాత పూజకు వెళ్లి తిరిగి ఇంటికి ప్రయాణమయ్యాడు.
ఈ క్రమంలో కల్హేర్ గ్రామ శివారులో పొమ్యానాయక్ తండాకు వెళ్లే మార్గంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ అతివేగంగా వచ్చి గోపాల్ బైక్కు ఢీ కొంది. దీంతో తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి మూడ్ అమ్రిసింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాపు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.