సంగారెడ్డి, జనవరి 20: ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభు త్వం చేపడుతున్న పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నారని టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతాప్రభాకర్ అన్నారు. శుక్రవారం కంది మండలం ఎర్దనూర్ తండా సర్పంచ్ నేనవత్ రాందాస్ నాయక్తో పాటు తండాకు చెందిన ఉప స ర్పంచ్, వార్డు సభ్యులు, 50మంది అనుచరులు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ అ ధ్యక్షుడు చింతాప్రభాకర్ సమక్షంలో కండువాలు వేసుకుని బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన సర్పంచ్, ఉపసర్పంచ్లకు ప్రభాకర్ పుష్పగుచ్చాలు అందజేసి సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నరన్నారు.
అదే కాకుండా గ్రామాలు, తండా ల అభివృద్ధికి నిధులు విడుదల చేసి అభివృద్ధి చేయడం బీఆర్ఎస్కే సాధ్యమన్నారు. జాతీయ పార్టీగా ప్రకటించి న అనంతరం దక్షిణాది రాష్ర్టాల్లో బీఆర్ఎస్ ఆదరణ పెరుగుతున్నదని ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
అభివృద్ధి చూసే బీఆర్ఎస్లో చేరా..
ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీలతో సంబంధం లేకుండా అర్హులకు సంక్షే మ పథకాలు అందిస్తున్నారని సర్పం చ్ రాందాస్ నాయక్ అన్నారు. పేదోళ్ల సంక్షేమానికి కృషి చేస్తున్న వ్యక్తి చింతా ప్రభాకర్ అని గుర్తించి పార్టీలో చేరడానికి ముఖ్య కారణమన్నారు. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఉనికి చాటుతుందని పార్టీలో చేరిన సర్పంచ్ ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన వారు ఉప సర్పంచ్ బాలయ్య నాయక్, మాజీ ఎంపీటీసీ హరిచందర్ నాయక్, నాయకు లు గోపాల్ నాయక్, వార్డు సభ్యులు రాజు, రాఘవులు, శేవ్య నాయక్, శ్రీను, సురేశ్, నరేశ్లు ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రం థాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, జడ్పీటీసీ కొండల్రెడ్డి, నాయకులు చిల్వరి ప్రభాకర్, కాసాల రాంరెడ్డి, ఎర్దనూర్ సర్పంచ్, ఎంపీటీసీ హన్మంతు, తొపుగొండ సర్పంచ్ గోపాల్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.