సంగారెడ్డి : సీఎం కేసీఆర్ జన్మదినది వేడుకలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా జిల్లా అంతటా సీఎం కేసీఆర్ జన్మదిన సంబురాలు అంబరాన్నంటాయి. ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. పఠాన్ చెరువులో కేసీఆర్ జన్మదినం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు.