జహీరాబాద్, నవంబర్ 12: కేం ద్ర ప్రభుత్వం కులం, మతం పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించి ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు సరిహద్దులో దాడులు చేస్తున్నదని, ప్రజలకు చేసిందని ఏమి లేదని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు మండిపడ్డారు. శుక్రవారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. బీజేపీ కర్ణాటకలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, వ్యవసానికి ఉచిత విద్యుత్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే వరకు టీఆర్ఎస్ అందోళనలు చేస్తున్నదన్నారు. అనంతరం మాజీ ఎమ్మె ల్సీ ఫరీదుద్దీన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పంజాబ్లో ‘పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయడం లేదని’ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్క మెడికల్ కళాశాల మంజూరు చేయలేదని, ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయలేదన్నారు. ధర్నా కార్యక్రమంలో జహీరాబాద్ సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, ఆత్మ చైర్మన్ విజయ్కుమార్, టీఆర్ఎస్ పట్టణ, మండల పార్టీ అధ్యక్షుడు మోయినోద్దీన్, ఎంజీ. రాములు, రవీందర్, శ్రీనివాస్రెడ్డి, నర్సింహులు, రాచయ్యస్వామి, టీఆర్ఎస్ నాయకులు మోహన్రెడ్డి, భాస్కర్, నామ రవికిరణ్, ఇజ్రాయిల్ బాబీతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.