మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 3 : మార్చి 31తో వార్షిక సంవత్సరం ముగియనుండటంతో మున్సిపల్ ఆస్తిపన్ను వసూలుపై దృష్టి కేంద్రికరించింది. ఈ మేరకు బిల్ కలెక్టర్లతో పాటు పన్ను వసూలుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. బకాయిదారుల ఇంటింటికెళ్లి ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ రెవెన్యూ అధికారి హర్షద్ మాట్లాడుతూ 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్నులను మార్చి 31లోగా చెల్లించాలని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారంతో పాటు సెలవు దినాల్లో సైతం ఆస్తి పన్నులు చెల్లించడానికి గురువారం నుంచి మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆన్లైన్ ద్వారా, మీ సేవ కేంద్రాల ద్వారా ఆస్తి పన్ను చెల్లించవచ్చన్నారు. మున్సిపల్ శాఖ ప్రత్యేకంగా ఆస్తి పన్నులు చెల్లించడానికి వాట్సాప్ నంబర్ 9000253342ను అందుబాటులోకి తెచ్చింది. ఈ వాట్సాప్ నంబర్ ద్వారా సులభంగా చెల్లించవచ్చన్నారు. ఆస్తి పన్ను బాకాయిలదారులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మార్చి 31లోగా ఆస్తి పన్నులను చెల్లించని పక్షంలో అపరాధ రుసుముతో వసూలు చేయనున్నామని తెలిపారు. ఈ నెల చివరి వరకు 70 శాతం వరకు ఆస్తిపన్ను వసూలు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని తెలిపారు