పుల్కల్ రూరల్, అక్టోబర్ 10 : జిల్లా లోని సింగూరు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు గత 20 రోజులుగా ప్రాజెక్టులోకి వరద ఉధృతి తీవ్రంగా కొనసాగింది. ఇన్ ఫ్లో ఎక్కువగా వస్తుండడంతో ప్రాజెక్టు అధికారులు మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
కాగా శనివారం సాయంత్రం వరకు వరద పూర్తి గా తగ్గి పోవడంతో రాత్రి 8 : 45 గంటలకు నీటి పారుదలశాఖ అధికారులు అన్ని గేట్లను మూసివేసారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 28.885 టీఎంసీల నీటి మట్టం ఉంది.
ప్రాజెక్టు డిప్యూటి డీఈ నాగరాజు విలేఖరులతో తెలిపారు.