నారాయణఖేడ్, నవంబర్ 2 : వాహనదారులు నిబంధనలను అతిక్రమించి ప్రయాణికులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జహీరాబాద్ ఎంవీఐ హితేశ్కుమార్ తెలిపారు. మంగళవారం నారాయణఖేడ్ పట్టణంలోని కరస్గుత్తి రోడ్డు ప్రాంతంలో ఆర్టీసీ డీవీఎం ప్రభులత, స్థానిక ఆర్టీసీ డీఎం మూర్తిలతో కలిసి వాహనాల తనిఖీ చేపట్టిన సందర్భంగా మాట్లాడారు.
వాహనదారులు తమకున్న అనుమతులకు భిన్నంగా స్వంత వాహనాల్లో ప్రయాణికులను తరలిస్తున్నారన్నారు.
నిబంధనలను పాటించని ప్రైవేట్ వాహనదారుల కారణంగా ఆర్టీసీ ఆదాయానికి గండి పడుతుందన్నారు. ఈ మేరకు అనుమతులు లేకుండా ప్రయాణికులను తరలిస్తున్న 16 వాహనాలను సీజ్ చేశామన్నారు. నారాయణఖేడ్లో ప్రతి రోజు వాహన తనిఖీలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.