ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునేలా చూడండి
సంగారెడ్డి జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీజైపాల్రెడ్డి
జడ్పీ స్థాయీ సంఘ సమావేశం
సంగారెడ్డి, జూలై 15 (నమస్తే తెలంగాణ): కరోనా థర్డ్వేవ్పై జిల్లా ప్రజలను అప్రమత్తం చేయాలని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అధ్యక్షతన విద్యా, వైద్యం, గ్రామీణాభివృద్ధ్ది, పనులు, ఆర్థిక ప్రణాళిక స్థాయీ సంఘం సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో స్థాయీ సంఘం సభ్యులతోపాటు జడ్పీ సీఈవో ఎల్లయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి మాట్లాడుతూ కరోనా థర్డ్వేవ్పై ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్వో డాక్టర్ గాయత్రీదేవికి సూచించారు. ఇటీవల న్యాల్కల్ మండలంలోని కొన్ని గ్రామాల్లో పర్యటించగా అక్కడి ప్రజలు టీకాకు ఆసక్తి చూపటం లేదన్నారు. విద్యా, వైద్యం స్థాయీ సంఘం సభ్యుడు కొండల్రెడ్డి అడిగిన, తెలిపిన సమస్యలకు డీఎంహెచ్వో డాక్టర్ గాయత్రీదేవి స్పందించారు. జిల్లా అంతటా స్థానికులకు టీకా వేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని, నందిలోని పీహెచ్సీలో టీకా పంపిణీలో తలెత్తుతున్న సమస్యలు పరిష్కరిస్తామన్నారు. త్వరలో గర్భిణులు, పాలిచ్చే తల్లులకు టీకా వేయనున్నట్లు చెప్పారు. వైద్య విధాన పరిషత్ దవాఖానల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని, సంగారెడ్డిలోని ప్రభుత్వ దవాఖానలో రూ. కోటి రూపాయలతో సీటీస్కాన్ యంత్రం ఏర్పాటు చేస్తున్న ట్లు వైద్య విధానపరిషత్ అధికారి మధుకర్ చెప్పారు.
పల్లెప్రగతి విజయవంతం..
జిల్లాల్లో పల్లెప్రగతి విజయవంతమైందని గ్రామీణాభివృద్ది స్థాయీ సంఘం సమావేశంలో డీపీవో సురేశ్ మోహన్ తెలిపారు. కాలుష్యనియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు పీసీబీ అధికారులు భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి సభ్యులకు వివరించారు. పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు పది కంపెనీలకు నోటీసు జారీ చేసి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ శ్రీనివాస్ జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనులను వివరించారు. ఈ సందర్భంగా జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి మాట్లాడుతూ అందోలు, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో రహదారుల, భవన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఇర్గిపల్లి గ్రామంలోని ఎల్లమ్మ ఆలయానికి విద్యుత్ కనెక్షన్ కోసం కరెంటు స్తంభాలు ఏర్పాటుచేయాలని పనులు స్థాయీ సంఘం సభ్యురాలు సునీత ట్రాన్స్కో అధికారులను కోరారు.
అమీన్పూర్ జడ్పీటీసీ సుధాకర్రెడ్డి, కల్హేర్ జడ్పీటీసీ నర్సింహారెడ్డి, రాయికోడ్ జడ్పీటీసీ మల్లికార్జున్ పటేల్ తమ ప్రాంతాల్లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వెంటనే పరిష్కరించాలని కోరారు. సమావేశంలో సభ్యులు పనులు స్థాయీ సంఘం సభ్యురాలు సునీత, కె.రమేశ్, ఆంజనేయులు, మీనాక్షి పాల్గొన్నారు. గ్రామీణాభివృద్ధి స్థాయీ సంఘం సమావేశంలో సభ్యులు రాఘవరెడ్డి, పి.అరుణారెడ్డి, పనులు స్థాయీ సంఘం సమావేశంలో సభ్యులు సుధాకర్రెడ్డి, పి.సునీత, నర్సింహారెడ్డి, మల్లికార్జున్ పటేల్ పాల్గొన్నారు.