అమీన్పూర్, అక్టోబర్ 06 : బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున చీరెలు అందజేయడం ఆడబిడ్డలకు ఇచ్చే గౌరవం అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు చిహ్నమే బతుకమ్మ అని అన్నారు. ప్రపంచంలో పూలను పూజించే ఏకైక పండుగ బతుకమ్మ అని, పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరుతూ.. పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలోని మహిళలు పండుగను కొత్త దుస్తులతో సంతోషంగా జరుపుకోవాలనే సీఎం కేసీఆర్ మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారని చెప్పారు. పండుగను ఉత్సాహంగా జరుపుకోవాలన్దే సీఎం కేసీఆర్ అభిమతం అన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నర్సింహాగౌడ్, తహసీల్దార్ విజయ్కుమార్, మున్సిపల్ కమిషనర్ సుజాత, ఆయా వార్డుల కౌన్సిలర్లు బాశెట్టి కృష్ణ, బిజిలీ రాజు, నాయకులు శ్రీనివాస్రెడ్డి, బాలరాజు, దాస్యాదవ్, రమేశ్గౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బాల్రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు తలారి రాములు, యూనూస్, కాలనీవాసులు ఉన్నారు.