సంగారెడ్డి, మార్చి17: బ్లాక్ ఫిల్మ్ నిషేధించామని, వాహనాలకు ఈ ఫిల్మ్ వేయొద్దని సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న నేరాలను నియంత్రించేందుకు సీసీ కెమెరాలు చాలా ఉపయోగపడుతున్నాయన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు వివరిస్తూ, స్వచ్ఛందంగా ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని పోలీసు అధికారులకు సూచించారు. రోడ్డు ప్రమాదాల కేసుల్లో విచారణ చేసేటప్పుడు ఆ నేరం ఏవిధంగా జరిగింది, అందుకు ప్రధాన కారణాలపై దృష్టి సారించాలన్నారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో (అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రేవ్, నాన్గ్రేవ్ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఏ విషయాలను అధికారులు మరువొద్దన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఉషా విశ్వనాథ్, సంగారెడ్డి, పటాన్చెరు, నారాయణఖేడ్, జహీరాబాద్ల డీఎస్పీలు రవీంద్రారెడ్డి, భీమ్రెడ్డి, రఘు, వెంకట్రామ్రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ, ఇన్స్పెక్టర్ రమేశ్,ఎస్బీ ఇన్స్పెక్టర్ మహేశ్గౌడ్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ అధికారులదే ముఖ్యపాత్ర అని, ప్రజలకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం కలిగించేది రిసెప్షన్లేనని ఎస్పీ రమణకుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో రిసెప్షన్ వర్టికల్లో రాష్ట్ర స్థాయిలో మూడు పురస్కారాలకు ఎంపికైన తోట భూమన్న (జోగిపేట్), అరుణకుమారి (సదాశివపేట్), స్వరూప (ఐడీఏ బొల్లారం)లను ఎస్పీ అభినందించారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 721 పోలీస్స్టేషన్లలో పని చేస్తున్న రిసెప్షన్ సిబ్బందిలో 75 మంది అధికారులను ఎంపిక చేశారు. రాష్ట్ర పోలీస్ అకాడమీ, రాణి రుద్రమదేవి ఆడిటోరియంలో నిర్వహించిన సన్మాన సభలో రిసెప్షన్ సిబ్బందికి డీజీపీ అంజనీకుమార్, అభిలాష బిష్త్, మహేశ్భగవత్, సందీప్ శాండిల్య, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అధికారులు బహుమతులు అందజేశారు. ఉత్తమ పనితీరు కనబరిచిన ముగ్గురు రిసెప్షన్ అధికారులు ఎంపికైన వారికి యంత్రాంగం తరుఫున అభినందనలు తెలిపారు