సంగారెడ్డి, డిసెంబరు5ః సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన చింతా ప్రభాకర్కు సంగారెడ్డి పట్టణం, మండలం, కొండాపూర్ మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో సంగారెడ్డి మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యులు, చైర్మన్ ప్రభుగౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. పట్టణానికి చెందిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు హరికిషన్ చింతా ప్రభాకర్కు శుభాకాంక్షలు తెలిపారు. కొండాపూర్ మండలం మల్కాపూర్కు చెందిన పీఏసీఎస్ చైర్మన్ ఆకుల పవన్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన నాయకులు, మల్లేపల్లి నాయకులు, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాకం విఠల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
కంది మండలం చిద్రుప్ప మాజీ సర్పంచ్ తాళ్ల నర్సింహాగౌడ్ సమక్షంలో గ్రామ బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువా కప్పి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపినవారిలో కాసాల బుచ్చిరెడ్డి, ఎంపీటీసీలు శ్రీనివాస్గౌడ్, రాందాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పరశురామ్ నాయక్, విజయలక్ష్మి, పీఏసీఎస్ డైరెక్టర్ వీరేశం, నాయకులు ఎర్రోళ్ల చిన్నా, మాజీద్, కుమార్, ఆకుల శంకర్, శంషోద్దీన్, వీరేశం, భాస్కర్, మాజీ సర్పంచ్ మానయ్య, పండల పాండురంగం, రామకృష్ణారెడ్డి, సామెల్, సతీశ్, నరేందర్, శ్యాంరావ్, సత్యానందం, నాగయ్య, రఘునాథ్రెడ్డి పలు గ్రామాల నాయకులు ఉన్నారు.