సంగారెడ్డి మున్సిపాలిటీ, ఆగస్టు 3: ఆషాఢ మాసం సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం పద్మశాలి భవనం నుంచి పట్టణ అధ్యక్షుడు భగవాన్దాస్ నేతృత్వంలో అస్తబల్లోని రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం వరకు వైభవంగా భోనాల ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు గుండు సత్యనారాయణ, రాష్ట్ర యువజన ఉపాధ్యక్షుడు గందమల్లె రాజు, పట్టణ కార్యదర్శి విశ్వనాథం, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ మార్కండేయ, యూత్ అధ్యక్షుడు శ్రీరాం వెంకట్, కార్యదర్శి నాగరాజు, కౌన్సిలర్ జీవీ వీణా శ్రీనివాస్, విజయలక్ష్మీ విఠల్, మహిళా సంఘం కార్యదర్శి సంగీత, సూర్యకళ, మహిళలు, పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు.
వీరన్నగూడెంలో
ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల పండుగను వీరన్నగూడెంలో నిర్వహించారు. మంగళవారం వీరన్నగూడెంలో సర్పంచ్ మమతావేణు, ఉపసర్పంచ్ కుమార్, ఎంపీటీసీ నాగేందర్గౌడ్, గ్రామస్తుల ఆధ్వర్యంలో రేణుకాఎల్లమ్మ బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారికి అభిషేకాలతో ప్రత్యేక పూజలను నిర్వహించారు. వీరన్నగూడెం నుంచి ఘటాల ఎదుర్కోళ్లు నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో మహిళలు బోనాలను భక్తి శ్రద్ధలతో అమ్మవారి వద్దకు తీసుకవచ్చారు. ఎంపీపీ సద్దిప్రవీణావిజయభాస్కర్రెడ్డి, బొంతపల్లి సర్పంచ్ ఆలేటి నవీనాశ్రీనివాస్రెడ్డి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ గటాటి భద్రప్ప, మాజీ ఎంపీటీసీ వేణు, మాజీ ఉపసర్పంచ్ లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ నాయకులు మడపతి గణేశ్, మడపతి చంద్రశేఖర్, హుస్సేన్, ఇజాజ్ పాషా, మోహన్, రాజు, షరీఫ్ పాల్గొన్నారు.