పటాన్చెరు, జూలై 24: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ముక్కోటి వృక్షార్చనలో భాగంగా శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. పటాన్చెరు పట్టణంలోని శనివారం హజరత్ సయ్యద్ నిజముద్దీన్ షాయిద్ దర్గాలో నిర్వహించిన ముక్కోటి వృక్షార్చనలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలి ప్రొటెం చైర్మన్ దర్గా ప్రతినిధులు, ఎంపీ, ఎమ్మెల్యేతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువ నాయకుడు, మంత్రి కేటీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఐటీ రంగానికి ఆయన చేస్తున్న కృషిని అభినందించారు. మున్సిపల్శాఖ మంత్రిగా అద్భుతంగా పనిచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారంటూ కొనియాడారు. సంపూర్ణ ఆరోగ్య రాష్ట్రంగా తయారు చేయాలనే ధృడ సంకల్పంతో సీఎం కేసీఆర్ హరితహారం వంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.
రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అంకురార్పణ చేసి తీసుకురావడాన్ని అభినందించారు. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలా చేపడుతున్న ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం మహత్తరమైన కార్యక్రమంగా చరిత్రలో నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికీ ఆయన పేరుపేరున ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి మాట్లాడుతూ పటాన్చెరుకు ఆంధ్రపదేశ్లోని కడియం నర్సరీ నుంచి దాదాపు 15వేల మొక్కలు తెప్పించడం జరిగిందన్నారు. ముక్కోటి వృక్షార్చనలో భాగంగా నిజముద్దీన్ సాహెబ్ దర్గా నుంచి ఎల్లంకీ ఇంజినీరింగ్ కళాశాల రోడ్డు వరకు నాటనున్నట్లు వెల్లడించారు. ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మా ట్లాడుతూ ముక్కోటి వృక్షార్చన ఉద్యమంలా జరుగుతుండడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇందులో భాగస్వాములైన ప్రతిఒక్కరికీ ధన్యావాదాలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, నాయకులు దశరథరెడ్డి, వెంకట్రెడ్డి, అఫ్జల్, దర్గా ప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.