రామచంద్రాపురం, జూలై 24 : హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పిలుపునిచ్చారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఆర్సీపురం, భారతీనగర్ల్లో కార్పొరేటర్లు పుష్పానగేశ్, సింధూఆదర్శ్రెడ్డితో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా పటాన్చెరు, ఆర్సీపురం, భారతీనగర్ డివిజన్ల్లో 16 వేల మొక్కలు నాటామన్నారు. మొక్కలు నాటడమే కాదు.. వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ బాలయ్య, మాజీ కార్పొరేటర్ అంజయ్య, నాయకులు ఆదర్శ్రెడ్డి, నగేశ్, కుమార్గౌడ్, మోహన్రెడ్డి, దేవేంద్రాయారి, పరమేశ్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు కరోనా జాగ్రత్తలు పాటించాలి..
జిన్నారం, జూలై 24 : విద్యార్థులు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ చదువుకోవాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సూచించారు. శనివారం జంగంపేట ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ ప్రభుత్వ సూచనలు పాటిస్తూ విద్యార్థులు చదువుకోవాలన్నారు. మాదారం గ్రామంలో సర్పంచ్ సరితాసురేందర్గౌడ్, హెచ్ఎం అంజయ్య విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేశారు.
రాష్ర్టాభివృద్ధిలో మంత్రి కేటీఆర్ది కీలకపాత్ర
అమీన్పూర్, జూలై 24 : రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లడంలో మంత్రి కేటీఆర్ కీలక పాత్ర వహిస్తున్నారని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని శనివారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు ఓడీఎఫ్ కాలనీ, లాలాబాయి కాలనీల్లో కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ ఒకేరోజు మూడు కోట్ల మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. మంత్రి కేటీఆర్ నిండునూరేళ్లు చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నర్సింహాగౌడ్, మున్సిపల్ కమిషనర్ సుజాత, ఆయా వార్డుల కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మొక్కలు నాటిన మున్సిపల్ పాలకవర్గం..
బొల్లారం, జూలై 24 : మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ముక్కోటి వృక్షార్చనలో భాగంగా బొల్లారం మున్సిపల్ పాలకవర్గం, అధికారులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని మాధవాని కుంట సమీపంలోని సర్వీస్ రోడ్డు పక్కన చైర్పర్సన్ కొలన్ రోజాబాల్రెడ్డి ఆధ్వర్యంలో పాలకవర్గం సభ్యులు మొక్క లు నాటారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేంద్రకుమార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఘనంగా మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు..
గుమ్మడిదల, జూలై 24 : మండల కేంద్రంలో సర్పంచ్ చిమ్ముల నర్సింహారెడ్డి, బొంతపల్లిలో సర్పంచ్ ఆలేటి నవీనాశ్రీనివాస్రెడ్డి, వీరన్నగూడెంలో మమతావేణు, దోమడుగులో సర్పంచ్ రాజశేఖర్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోటి వృక్షార్చనలో భాగంగా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ సద్ది ప్రవీణావిజయభాస్కర్రెడ్డి, జడ్పీటీసీ కుమార్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నరేందర్రెడ్డి పాల్గొన్నారు. నల్లవల్లి, కొత్తపల్లి, మంభాపూర్లో ఎంపీటీసీ ప్రభాకర్రెడ్డి, సర్పంచ్లు ఆంజనేయులు, శంకర్, కంజర్ల శ్రీనివాస్ కోటి వృక్షార్చనలో పాల్గొని మొక్కలు నాటారు.
వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు..
మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఎంపీపీ సద్దిప్రవీణావిజయభాస్కర్రెడ్డి, జడ్పీటీసీ కు మార్గౌడ్, టీఆర్ఎస్ మండల నాయకులు, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఆలేటి శ్రీనివాస్రెడ్డి వీరభద్రస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు.