సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 15: నేడు జరుగనున్న గ్రూప్-1 పరీక్ష నిర్వహణ కోసం సంగారెడ్డి జిల్లాలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం నిర్వహించనున్న పరీక్షకు ఎలాంటి పొరపాట్లు లేకుండా జరిగేలా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు 26 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, మొత్తం 8,654 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు అధికారులు వెల్లడించారు. సంగారెడ్డిలో 12 పరీక్షా కేంద్రాలు, సదాశివపేటలో 2, పటాన్చెరులో 7, రామచంద్రపురంలో 5 పరీక్షా కేంద్రాల ఉండగా, ఆయా కేంద్రాల్లో అవసరమైన ఫ్యాన్లు, ఫర్నిచర్, లైట్లు, తాగునీటి సౌకర్యాలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ప్రతి గదికి సీసీ కెమెరాలు అమర్చి మానిటరింగ్ చేయన్నారు. అయితే పరీక్ష హాజరుకు మొదటిసారి బయోమెట్రిక్ తీసుకుకోనుండగా, ప్రతి 60 మంది అభ్యర్థులకు ఒకటి చొప్పున బయోమెట్రిక్ డివైస్ ఏర్పాటు చేశారు. బయోమెట్రిక్ అటెండెన్స్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన బాధ్యతను కలెక్టర్ సీఎస్లకే అప్పగించారు. బయోమెట్రిక్ క్యాప్చర్ కాని పక్షంలో వేలి ముద్ర పేపర్పై తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.
అభ్యర్థులు ముందస్తుగా చేరుకోవాలి
పరీక్ష రాసేందుకు వచ్చే అభ్యర్థులు ఆదివారం ఉదయం 8.30 గంటలకే పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నట్లు కలెక్టర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఉదయం 10.15 తర్వాత పరీక్షా కేంద్రం గేట్లు మూసివేయన్నారు. అభ్యర్థులు ఆయా పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునేందుకు వీలుగా ప్రధాన కూడళ్లలో అభ్యర్థులకు తెలిసేలా చార్టులు ప్రదర్శించాలని కలెక్టర్ సూచించారు. అభ్యర్థులు ఆయా పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునేలా బస్సులు నడపనున్నారు.
‘సమన్వయంతో పనిచేయాలి’
టీఎస్పీఎస్సీ నిర్దేశించిన మా ర్గదర్శకాలకు అనుగుణం గా గ్రూప్-1 పరీక్ష ప్రశాం త వాతావరణంలో జరిగే లా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని మెదక్ కలెక్టర్ హరీశ్ ఆదేశించారు. ఆదివారం గ్రూప్-1 పరీక్ష ఏర్పాట్లపై శనివారం అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, జోనల్ అధికారులు, లైజన్, సహాయ లైజన్ అధికారులు, కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 3,293 మంది అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు ఏడు కేంద్రాల ను ఏర్పాటు చేసి, సి బ్బందిని నియమించామని, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప రీక్ష సజావుగా నిర్వహించాలని సూచించారు. అభ్యర్థులను చెక్ చే సిన అనంతరం బయోమెట్రిక్ వి ధానం ద్వారా పరిశీలించి హాల్టికెట్ పై హోలోగ్రాం వేసి పంపాలన్నారు. అభ్యర్థులు హాల్టికెట్ నెంబరు, ఓఎంఆర్ షీట్లో బుక్లెట్ సంఖ్య, కేంద్రం కోడ్ సరిగ్గా వేసేలా చూడాలన్నారు. లైజన్ అధికారులు పరీక్ష నిర్వహణ ప్ర క్రియపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, చీఫ్ సూపరింటెండెంట్ గదిలో సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తుండాలన్నారు. పరీక్ష అనంతరం చెక్లిస్ట్ ప్ర కారం అప్పగించాలని సూచించారు. టెలికాన్ఫరెన్స్లో ఆర్డీవో సాయిరాం, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, కలెక్టరేట్ ఏవో యూ నుస్, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు
గ్రూప్-1 పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అధికారులందరూ బాధ్యతతో పని చేయాలి. జిల్లాలో ఏర్పాటు చేసిన 26 కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశాం. టీఎస్పీఎస్సీ నిబంధనల మేరకు పరీక్షకు హాజరు కావాలని, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ 08455-272233కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చు.
– సంగారెడ్డి కలెక్టర్ శరత్