జహీరాబాద్, మార్చి6: చెరుకు రైతులకు సమస్యలు పరిష్కరిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. జహీరాబాద్ మండలం కొతూర్(బి) గ్రామం లోని ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీలో దాదాపు 2.5 లక్షల టన్నుల చెరుకు క్రషింగ్ను ప్రారంభిం చారు. రాష్ట్ర మంత్రి హరీశ్రావు ప్రత్యేక చర్యలు తీసుకుని, యజ మన్యంతో పలుమార్లు సమావే శం నిర్వహించి క్రషింగ్ ప్రారంభించాలని ఆదేశించారు. దీంతో యజమన్యం క్రషింగ్ ప్రారంభించి తమ లక్ష్యా న్ని పూర్తి చేసింది. ఈనెల 7న క్రషింగ్ను ఆపేయ నున్నారు. జోన్ పరిధిలోని రైతుల వద్ద చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం చెరుకును పూర్తిగా తీసుకుని, క్రషింగ్ చేసి బిల్లులు చెల్లిస్తున్నారు. మంత్రి, కలెక్టర్తో మాట్లాడి పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించేందుకు కృషిచేశారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నం చేశారు. జహీరాబాద్ జోన్ పరిధిలో మిగిలిపోయిన చెరుకును సంగారెడ్డిలోని గణపతి, కామారెడ్డి జిల్లా మాగిలోని ఫ్యాక్టరీలకు తరలించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని సంగారెడ్డి జిల్లా చెరుకు అభివృద్ధి అధికారి రాజశేఖర్ తెలిపారు. ట్రైడెంట్ ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేసిన వెంటనే బిల్లులు చెల్లించేందుకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.